దేశంలో కరోనావ్యాప్తి మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల కీలక నాయకులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతునట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జూలై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా నితీష్ కుమార్ హాజరుకాలేదు. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఈ ఏడాదిలో కరోనా పాజిటివ్ గా తేలడం ఇది రెండోసారి. గత జనవరిలో కూడా నితీష్ కుమార్ కరోనా బారినపడి కోలుకున్నారు. మరోవైపు దేశంలో జూలై 26, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,39,20,451కి చేరింది. గత 24 గంటల్లోనే కొత్తగా 14,830 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY