ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీసెట్-2022 ను జూలై 4 నుంచి 12వ తేదీవరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విజయవాడలో ఈఏపీసెట్-2022 ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈఏపీసెట్-2022కు మొత్తం 2,82,496 మంది హాజరుకాగా 2,56,983 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు.
ఇంజనీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)కు 1,94,752 మంది హాజరుకాగా, అందులో 1,73,572 మంది అనగా 89.12 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది హాజరుకాగా, అందులో 83,411 మంది అనగా 95.06 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలో మొత్తం 258 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, అందులో 1,48,283 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఫార్మసీలో 127 కాలేజీలు ఉండగా 16700 సీట్లు ఉన్నాయన్నారు. మరోవైపు పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికార వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET/ లో చూసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY