‘ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2023’ అవార్డుకు ఎంపికైన ‘కియా’.. అభినందనలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Congratulates KIA Cars Company For Achieving Indian Car of The Year-2023 Award,TDP Chief Chandrababu,Congratulates KIA Cars,KIA Cars Company,Achieving Indian Car of The Year,Indian Car of The Year-2023 Award,Indian Car of The Year,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా మోటార్స్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక్కడి యూనిట్‌లో తయారు చేసిన ‘కారెన్స్‌’ మోడల్‌ కారు ఈ సంవత్సరం ‘ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికైంది. దీంతో కియాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కియాను అభినందించారు. కాగా చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కియా మోటార్స్ అనంతపురంలో ఏర్పావడం గమనార్హం. ఎన్నో రాయితీలను ప్రకటించి కియా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ నెలకొల్పేలా ఆయన కృషి చేశారు. దీంతో ఇప్పుడు ఆ కంపెనీ కేంద్ర అవార్డు గెలుచుకోవడంతో ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన ట్విటర్‌లో.. ‘అనంతపురంలోని తమ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన మోడల్‌ ‘కారెన్స్‌’ కారు ద్వారా ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2023’ అవార్డును గెలుచుకున్నందుకు ‘కియా’ కంపెనీకి అభినందనలు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =