దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో ఆయన మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ భాగంగా మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ