భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటన చేసింది. “మహారాష్ట్ర రాష్ట్రంలోని పర్బానీకి చెందిన మాణిక్ కదమ్ మహారాష్ట్ర రాష్ట్ర భారత రాష్ట్ర సమితి పార్టీకి కిసాన్ సెల్ (భారత్ రాష్ట్ర కిసాన్ సమితి) అధ్యక్షుడిగా నియమితులయ్యారు” అని ప్రకటనలో పేర్కొన్నారు. మాణిక్ కదమ్ గత మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నారు. షేత్కరీ సంఘర్ష్ సమితి ద్వారా రైతులు ఆత్మహత్యకు పాల్పడకుండా, రైతులను చైతన్యం చేసే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టారు.
ఇక బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్) ఏర్పాటు చేసి, భారత్ రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడిగా హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన గుర్నామ్సింగ్ చదూనిని సీఎం కేసీఆర్ గతంలోనే నియమించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ కిసాన్ సెల్ ఏర్పాటు దిశగా, మహారాష్ట్ర రాష్ట్రంలో మొదటి నియామకం చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE