కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్ ను మరింతగా పొడిగించనున్నట్టు మీడియా, సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. మార్చ్ 30, సోమవారం నాడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ అంశంపై వివరణ ఇచ్చారు. “లాక్డౌన్ పొడగింపు ఊహాగానాలు పూర్తిగా నిరాధారం. ఈ వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతానికి లాక్డౌన్ పొడగించే యోచనేమీ లేదని” రాజీవ్ గౌబా స్పష్టత నిచ్చారు. ప్రభుత్వ ప్రకటనతో లాక్డౌన్ పొడిగింపు వార్తలు నిరాధారమైనవని తేలిపోయాయి. మరోవైపు భారత్లో కరోనా బాధితుల సంఖ్య 1071కు చేరిందని, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 29 మృతి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.
Home జాతీయం/అంతర్జాతీయం
- Advertisement -