సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షల నిర్వహణ తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ తరగతుల విద్యార్థులకు మే 4 నుంచి జూన్ 10 లోపల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జూలై 15న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఇక విద్యార్థులకు మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. పరీక్షలు, ప్రాక్టీకల్స్ పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ముందుగా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకున్న నేపథ్యంలో పరీక్షలు ప్రారంభమయ్యే తేదీని డిసెంబర్ 31 న ప్రకటిస్తానని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇటీవలే ట్వీట్ చేశారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించే తేదీలు, సంబంధిత ప్రక్రియను ఆయన వీడియో ద్వారా వివరించారు.
I announced the date of commencement for @cbseindia29 board #exams 2021 today. The exams will commence from May 4 and end before June 10. pic.twitter.com/sh0jbCBgcQ
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 31, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ