దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడిగిస్తునట్టు కేంద్రం ప్రకటించింది.
ఐటీ రిటర్న్ దాఖలుకు పొడిగించిన తేదీల వివరాలు:
- 2018-19 ఆర్ధిక సంవత్సారానికి సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలు : జులై 31 వరకు గడువు పొడిగింపు
- 2019-20 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలు : నవంబర్ 30 వరకు గడువు పొడిగింపు
- పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసేందుకు గడువు పెంపు : మార్చి 31, 2021
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu