కోవిడ్-19 (కరోనా వైరస్) పై చేస్తున్న పోరాటంలో భాగంగా వైరస్ యొక్క వ్యాప్తిని గుర్తించడానికి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోడానికి కేంద్ర ప్రభుత్వం టెలిఫోనిక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పౌరులకు ఫోన్ కాల్స్ చేసి ఈ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేలో ప్రజలకు “1921” అనే నంబర్ నుంచి కాల్స్ వస్తాయని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ సర్వేలో పాల్గొనాలని కోరారు.
“భారత ప్రభుత్వం టెలిఫోనిక్ సర్వే నిర్వహించనుంది. దేశ పౌరులు తమ మొబైల్ ఫోన్లలో ఎన్ఐసీ మరియు 1921 నంబర్ ద్వారా కాల్స్ పొందుతారు. ఇది నిజమైన సర్వే అని ప్రజలకు సమాచారం ఇవ్వబడింది మరియు కోవిడ్-19 లక్షణాల ప్రాబల్యం, వ్యాప్తిపై సరైన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొనమని అభ్యర్దిస్తున్నామని” కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కరోనా పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు ఏప్రిల్ 22, బుధవారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 19,984కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే కొత్తగా 50 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్యలో ఇప్పటి వరకు 3870 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఈ వైరస్ వలన 640 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 15,474 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
People are informed that it is a genuine survey and are requested to participate in good measure to enable proper feedback of the prevalence and distribution of #Covid19 symptoms.#CoronaOutbreak #SwasthaBharat @PMOIndia
— Ministry of Health 🇮🇳 #StayHome #StaySafe (@MoHFW_INDIA) April 21, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu