భారత్ లో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 6,817 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 957 మంది కోలుకోగా, 301 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో అటుఇటుగా సగం మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం. ముంబయి నగరంలో 4,447, పుణేలో 961, థానే లో 643, పాల్గర్ లో 135, నాసిక్ లో 127, నాగపూర్ లో 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఏప్రిల్ 25, శనివారం ఉదయం 8 గంటలకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 25,506 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 5,063 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఈ వైరస్ వలన 775 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,668 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]