దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ సహా అన్ని విధానాల ద్వారా ఇప్పటికి మొత్తం 63.09 కోట్లకుపైగా (63,09,30,270) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 4.87 కోట్లకుపైగా 4,87,39,946) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక మరో 21.76 లక్షల (21,76,930) వ్యాక్సిన్ డోసులు పైప్ లైన్ లో ఉన్నాయని, త్వరలోనే రాష్ట్రాలుకు చేరుతాయని పేర్కొన్నారు.
మరోవైపు దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా, ఆగస్టు 30, సోమవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 63.43 కోట్లు (63,43,81,358) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికి 60 ఏళ్లు వయసు దాటిన వారిలో 21%, 45-60 ఏళ్ల వయసు వారికి 30.8%, 18-44 ఏళ్ల వయసు వారికి 48.2% మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ