భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 27, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429 కు, మరణాల సంఖ్య 1,19,502 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 36,470 కరోనా పాజిటివ్ కేసులు, 488 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 72 లక్షలు దాటింది. ఒకే రోజులో 63,842 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 72,01,070 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 90.62 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,25,857 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో అక్టోబర్ 26 నాటికీ 10,44,20,894 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 09,58,116 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu