దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 16.16 కోట్లకుపైగా (16,16,86,140) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మొత్తం 15,10,77,933 డోసులను వినియోగించారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఒక కోటికి పైగా (1,06,08,207) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో 20 లక్షలకుపైగా (20,48,890) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ