పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎనిమిదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చివరిదైన ఈ దశలో 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 84.77 లక్షల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం మొత్తం 11,860 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటల వరకు 37.80 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
మరోవైపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం 641 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్యనే కీలక పోటీ నెలకుంది. ఇరు పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచారపర్వంలో పాల్గొనడంతో ఈ రాష్ట్ర ఫలితాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకుంది. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాల కూటమి ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఇక మే 2వ తేదీన ఓట్లలెక్కింపు పక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ