కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కావేరి-గోదావరి నదుల అనుసంధానంపై నేడు కీలక సమావేశం జరుగనుంది. రాజధాని ఢిల్లీ లోని శ్రమ శక్తి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. ఈ రెండు ముఖ్య నదుల అనుసంధానంపై సమగ్ర అవగాహన, వివరాల కొరకు 5 రాష్ట్రాల అధికారులతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల కారదర్శులు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో వ్యక్తం అయ్యే అభిప్రాయాలను, సూచనలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్వీకరించనున్నారు. అనంతరం ఒక నివేదిక రూపొందించి కేంద్రానికి అందివ్వనున్నారు. గోదావరి నది మిగులు జలాలను కావేరికి తరలించే లింక్ ప్రాజెక్టుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ