ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అసలు కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడ్డట్టు తెలుస్తుంది. వుహాన్ లో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ ఎత్తివేసినట్లు తాజాగా చైనా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ముందుగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది ఈ వుహాన్ నగరంలోనే. దీంతో కరోనా వైరస్ నియంత్రణకు చైనా ప్రభుత్వం జనవరి 23న వుహాన్ నగరంలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం అక్కడి హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు 76 రోజుల తర్వాత వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేశారు. అయితే చైనాలో కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 62 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా ప్రకటించింది.
Home జాతీయం/అంతర్జాతీయం
- Advertisement -