కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. మరో వైపు సుప్రీం కోర్టు సత్వరమే ఈ కేసు వినేందుకు నిరాకరించడంతో చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఆయనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉంది. మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా, చిదంబరం అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. సీబీఐ అధికారులతో పాటు ఈడీ కూడ చిదంబరం కోసం గాలిస్తున్నారు.
బుధవారం ఉదయం మరోసారి సీబీఐ అధికారులు ఢిల్లీలోని జోర్ భాఘ్ వద్ద ఉన్న చిదంబరం నివాసానికి వెళ్లారు,ముందస్తు బెయిల్ రద్దు తీర్పు వెలువడాక మూడుసార్లు చిదంబరం ఇంటికివెళ్ళి అధికారులు వెనుతిరిగారు, ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్టు చెబుతున్నారు. చిదంబరం ఇంటికి వస్తాడని భావించి చాలాసేపు వేచిఉన్న ఈడీ అధికారులు సైతం వెనుదిరిగారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి, నగదు చలామణి కేసుల్లో ముందస్తు బెయిల్ పై హైకోర్టు జస్టిస్ గౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు, ఇటువంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొన్నారు. సీబీఐ అరెస్ట్ చేసే నేపథ్యంలో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
[subscribe]
[youtube_video videoid=uySVGLzD1HA]