కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 176 కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా లక్షణాల నుండి 12 మంది కోలుకోగా, ఈ రోజే మొదటి మరణం నమోదైంది. కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో కరోనా కారణంగా 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరోవైపు 163 మందిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చ్ 28 ,శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వలన కేరళకి వచ్చే మార్గాన్ని కర్ణాటక మూసివేసిందని, దీంతో తమ రాష్ట్రానికి వచ్చే నిత్యావసర వస్తువులు సరఫరా ఆగిపోయిందని చెప్పారు. తలసెరి-కార్గ్ హైవే-30ని కర్ణాటక పోలీసులు బంద్ చేయడంపై చర్యలు తీసుకుని, నిత్యావసర వస్తువులు సరఫరా సాఫీగా సాగేలా చూడాలని లేఖలో ప్రధాని మోదీని కేరళ సీఎం కోరారు. ఈ సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ లేఖలో పేర్కొన్నారు.
Home జాతీయం/అంతర్జాతీయం
- Advertisement -