బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ మేరకు ఆ జాబితాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్, శత్రుఘన్ సిన్హా, మదన్ మోహన్ ఝా, భూపేష్ భాగేల్, తరిఖ్ అన్వర్, కీర్తి ఆజాద్, సంజయ్ నిరుపమ్, మీరాకుమార్, అశోక్ గెహ్లాట్, రాజ్ బబ్బర్, అనిల్ శర్మ సహా తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu