భారత్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం కూడా మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 49,769 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ చేయబడ్డారు. కోలుకున్న వారి మొత్తం సంఖ్య 13,78,105 కు చేరగా, కరోనా బాధితుల రికవరీ రేటు 67.62 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆగస్టు 7, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,27,074 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 62,538 కరోనా పాజిటివ్ కేసులు, 886 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఇక కరోనా మరణాల రేటు 2.07 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 7, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 20,27,074
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 6 – ఆగస్టు 7 (8AM-8AM)] : 62,538
- నమోదైన మరణాలు : 886
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 1,378,105
- యాక్టీవ్ కేసులు : 607,384
- మొత్తం మరణాల సంఖ్య : 41,585
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu