భారత్లో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన అప్డేట్ ప్రకారం.. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు) మొత్తం 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,282 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు దిగువకు వచ్చింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,49,49,671కి చేరింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారిన పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,547కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మే 1, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 87,038
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 30–మే 1 (8AM-8AM)] : 4,282
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,49,671
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 6,037
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,43,70,878
- కరోనా రికవరీ రేటు : 98.71 శాతం
- యాక్టివ్ కేసులు : 47,246
- కొత్తగా నమోదైన మరణాలు : 14
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,547
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (220,66,66,433) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE