ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీరిరువురూ ట్విట్టర్ ద్వారా సందేశాలను ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ట్విట్టర్లో.. ‘చెమట చుక్కలను ధారపోసి పరోక్షంగా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ప్రపంచంలో సంపద దృష్టి జరుగుతోంది. మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లు’ అని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం!’ అని పేర్కొన్నారు.
On the occasion of #MayDay, Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to all the workers, in different occupations, who sweat out and contribute, directly and indirectly, in the development of the society.#InternationalWorkersDay pic.twitter.com/eSBPWIb2Na
— Telangana CMO (@TelanganaCMO) May 1, 2023
కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.
కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం!— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE