దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 200 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 134 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 3, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,78,956 కు చేరుకుంది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,707 గా ఉంది. ఇక జనవరి 2న 1,51,186 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా నమోదైంది.
దేశంలో 2,582 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:
దేశంలో ప్రస్తుతం 2,582 (0.01%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 222 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,45,667 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు డబుల్ డిజిట్ లో నమోదయ్యాయి. కాగా దేశంలోని 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE