భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 7964 కరోనా పాజిటివ్ కేసులు, 265 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఒకేరోజు నమోదయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. మే 30, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,73,763 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 9 వ స్థానంలో నిలిచింది.
మరోవైపు కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,971 కి చేరింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో 82369 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, గత 24 గంటల్లోనే 11,263 డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 86422 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu