దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,51,09,286 కు చేరుకుంది. అలాగే కరోనాతో 325 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,876 కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.
ఇక ప్రస్తుతం 2,85,401 (0.81%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 19,206 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,43,41,009 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.38 శాతంగా నమోదైంది. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జనవరి 6, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 68,53,05,751
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,51,09,286
- కొత్తగా నమోదైన కేసులు [ జనవరి 5–జనవరి 6 (8AM-8AM)] : 90,928
- నమోదైన మరణాలు : 325
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,43,41,009
- యాక్టీవ్ కేసులు : 2,85,401
- మొత్తం మరణాల సంఖ్య : 4,82,876
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ