మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 23, మంగళవారం నాడు కూడా 6218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,12,312 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,857 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 5869 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,05,851 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.96 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.45 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 53,409 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మంగళవారం నాటికి మహారాష్ట్రలో 1,58,60,912 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ