ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు జనవరి 15 నాటికి ఉన్న బిల్లులను చెల్లించారు. మొత్తం 640 ఆసుపత్రులకు రెండు దఫాలుగా రూ.238.15 కోట్లును చెల్లించినట్టుగా ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లీఖార్జున ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పటిష్టంగా అమలవుతున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లింపు చేస్తున్నట్లు సీఈఓ మల్లీఖార్జున పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ