దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,825 కి పెరిగింది. దేశంలో మొత్తం 1,55,986 (1.41%) యాక్టీవ్ కేసులు ఉండగా, ప్రస్తుతం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,000 కంటే తక్కువగానే యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 12,179 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,07,50,680 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.17 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.42 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, చండీగర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, లద్దాఖ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 26, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 21,46,61,465
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,10,63,491
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 25–ఫిబ్రవరి 26 (8AM-8AM)] : 16,577
- నమోదైన మరణాలు : 120
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,07,50,680
- యాక్టీవ్ కేసులు : 1,55,986
- మొత్తం మరణాల సంఖ్య : 1,56,825
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ