తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1021 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ 11, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,13,084 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 6 గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1228 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 2,214 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,87,342 కి చేరింది. ప్రస్తుతం 24,514 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 87.91 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 228, మేడ్చల్ లో 84, రంగారెడ్డిలో 68, కరీంనగర్ లో 67, నల్గొండలో 46, సంగారెడ్డిలో 44, సిద్ధిపేటలో 41 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu