దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. మరోసారి కొత్త కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 17,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,33,62,294 కు చేరుకుంది. కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218, కేరళలో 3890 నమోదయ్యాయి. అలాగే కరోనాతో మరో 13 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,954 కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 88,284 (0.20%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరో 13,029 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,27,49,056 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.59 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 24, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 85,98,95,036
- జూన్ 23న నిర్వహించిన కరోనా పరీక్షలు : 4,01,649
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,33,62,294
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 23–జూన్ 24 (8AM-8AM)] : 17,336
- నమోదైన మరణాలు : 13
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,27,49,056
- యాక్టీవ్ కేసులు : 88,284
- మొత్తం మరణాల సంఖ్య : 5,24,954
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF