దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు, 1027 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,72,085 కి పెరిగింది. రోజువారీగా ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే 5 నెలల తరువాత దేశంలో రోజువారీ మరణాల సంఖ్య 1000 దాటింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 13 లక్షలు (13,65,704) దాటింది. మరో 82,339 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,23,36,036 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 88.92 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.24 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో లద్దాఖ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 14, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 26,06,18,866
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,38,73,825
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 13–ఏప్రిల్ 14 (8AM-8AM)] : 1,84,372
- నమోదైన మరణాలు : 1027
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,23,36,036
- యాక్టీవ్ కేసులు : 13,65,704
- మొత్తం మరణాల సంఖ్య : 1,72,085
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ