దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3,60,960 కరోనా కేసులు నమోదవడంతో ఏప్రిల్ 28, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 3293 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,01,187 కు చేరుకుంది. కరోనా వెలుగులోకి వచ్చాక ఒకే రోజు వ్యవధిలో 3 వేలకుపైగా మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో తరవాత భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.
దేశంలో 29 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 82.33 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్ గడ్, గుజరాత్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 29 లక్షలు (29,78,709) దాటింది. కొత్తగా 2,61,162 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,48,17,371 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 82.33 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.12 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 27, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 28,27,03,789 కు చేరుకుంది. గత 24 గంటల్లో 17,23,912 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ