తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 696 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 12, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,32,379 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3735 కి పెరిగింది. కొత్తగా 858 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,18,496 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 82, జీహెచ్ఎంసీ పరిధిలో 68, నల్గొండలో 49, పెద్దపల్లిలో 48, వరంగల్ అర్బన్ లో 48, కరీంనగర్ లో 45 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 12, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,98,65,968
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,32,379
- కొత్తగా నమోదైన కేసులు : 696
- నమోదైన మరణాలు : 6
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,18,496
- కరోనా రికవరీ రేటు: 97.80%
- యాక్టీవ్ కేసులు: 10,148
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3735
- కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ