దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 54 రోజులుగా 15 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,52,164 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 453 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,78,007 కి పెరిగింది. ప్రస్తుతం 79,097 (0.23%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 574 రోజుల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
గత 24 గంటల్లో కేరళ (2230), తమిళనాడు (605), మహారాష్ట్ర (544), వెస్ట్ బెంగాల్ (414), కర్ణాటక (222), మిజోరాం (217), ఒడిశా (186), తెలంగాణ (156), జమ్మూ అండ్ కశ్మీర్ (105), అస్సాం (94) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 8,043 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,41,95,060 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.40 శాతంగానూ, మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ