దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మే 16, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,70,284 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశంలో ప్రస్తుతం 36,18,458 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న 10 రాష్ట్రాలివే:
- కర్ణాటక – 6,00,147
- మహారాష్ట్ర – 4,68,109
- కేరళ – 4,40,649
- తమిళనాడు – 2,19,342,
- ఆంధ్రప్రదేశ్ – 2,10,436
- రాజస్థాన్ – 1,94,382
- ఉత్తర్ ప్రదేశ్ – 1,63,003
- పశ్చిమబెంగాల్ – 1,31,805
- గుజరాత్ – 1,04,908
- ఛత్తీస్ గడ్ – 1,03,593
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ