కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 43,210 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,560 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 5.92 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,54,974 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 30 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 48,184 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 2,150 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 51,86,737 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ