కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,748 కరోనా కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,22,567 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 45,155 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,202 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 51,48,703 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 28,035 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 5399 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 4652, కోజికోడ్ లో 3637, కొట్టాయంలో 3021, త్రిస్సుర్ లో 2377, కన్నూర్ లో 1544 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 4,09,53,454 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ