దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 63 రోజుల తరవాత దేశంలో లక్ష కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వరుసగా 26వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 86498 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,96,473 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 2123 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,51,309 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 13,03,702 (4.50%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా తమిళనాడు (19,448), కర్ణాటక (11,958), మహారాష్ట్ర (10,219), కేరళ (9,313), ఒడిశా (6,118), వెస్ట్ బెంగాల్ (5,887), ఆంధ్రప్రదేశ్ (4,872), అస్సాం (3,804), తెలంగాణ (1,933), ఛత్తీస్ గడ్ (1,285),వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 1,82,282 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,73,41,462 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.29 శాతం గానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ