తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆగస్టు 28, శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు:
- శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం
- సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహణ
- అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి, అక్టోబర్లో ఉత్సవాల నాటికీ కరోనా ప్రభావం తగ్గితే గతంలో లాగానే ఉత్సవాల నిర్వహించే అవకాశం
- కరోనా బారిన పడిన టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులు టీటీడీ భరించాలని పాలకమండలి నిర్ణయం
- టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడి
- బర్డ్ ఆసుపత్రిలో అదనపు గదుల నిర్మాణానికి రూ.5.5 కోట్లు కేటాయింపు
- సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి ఆమోదం
- టీటీడీలో ఎలక్రికల్ విభాగంలో పనిచేసే 53 కార్మికుల కాంట్రాక్టు మరో రెండు ఏళ్ళు పెంపు
- గో సంరక్షణకు అధికప్రాధాన్యత, ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం
- బ్యాంకుల్లో టీటీడీ బంగారు నగలు, నగదు డిపాజిట్ల విధానాలు మార్చాలని నిర్ణయం
- ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి ఆమోదం
- తిరుమలలో వ్యర్థాలను తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి రూ.కోటి విరాళం ఇచ్చినట్టు వెల్లడి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu