దేశంలో కొత్త కరోనా కేసులు నమోదు కొంత తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,092 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 14, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,53,464 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 41 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,27,037 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,16,861 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.54 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,16,861 (0.26%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 16,454 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,36,09,566 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక ఆగస్టు 13, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 88.02 కోట్లకు (88,02,82,103) చేరుకుంది. ఆగస్టు 13న 3,81,861 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY