దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,15,736 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785 కు చేరుకుంది. కరోనా వెలుగులోకొచ్చాక దేశంలో 24 గంటల వ్యవధిలో ఇంట భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కరోనాకు చికిత్స పొందుతూ మరో 630 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,66,177 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 8,43,473 (6.59%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (55469), ఛత్తీస్ గడ్ (9921), కర్ణాటక (6150), ఉత్తర్ ప్రదేశ్ (5895), ఢిల్లీ (5100), మధ్యప్రదేశ్ (3722), తమిళనాడు (3645), కేరళ (3502) వంటి 8 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1,15,736 కేసులలో 80.70% శాతం ఈ 8 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 92.11 శాతం, మరణాల రేటు 1.30 శాతం:
దేశంలో మరో 59,856 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,17,92,135 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 92.11 శాతం గానూ, మరణాల రేటు 1.30 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో ఒడిశా, లద్దాఖ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, లక్షద్వీప్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ