దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల్లో భారత్ మరో కీలక మైలురాయి దాటింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 5 కోట్లు దాటింది. సెప్టెంబర్ 8 నాటికీ మొత్తం 5,06,50,128 మంది శాంపిల్స్ పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 10,98,621 కరోనా పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతానికి దేశంలో ప్రతి మిలియన్ జనాభాకు 36,703 పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 1035 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 633 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 1668 అయింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా రోజువారీగా రికార్డ్ స్థాయిలో కరోనా బాధితులు కోలుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu