దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 16,504 కేసులు నమోదు కావడంతో జనవరి 4, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,03,40,469 కు చేరుకుంది. కరోనాతో మరో 214 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,49,649 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 99 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 19,557 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 99,46,867 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.19 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. భారతదేశం యొక్క కరోనా రికవరీ రేటు 96 శాతం దాటడంతో ప్రపంచంలోనే అత్యధికంగా నిలిచింది. ప్రస్తుతం 2,43,953 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 16,504 కేసులలో 83.90 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ