భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 20549 పాజిటివ్ కేసులు, 286 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 1,02,44,852 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,48,439 కి పెరిగింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 2,62,272 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 26,572 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 98,34,141 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.99 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 30, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 17,09,22,030
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,02,44,852
- కొత్తగా నమోదైన కేసులు [డిసెంబర్ 29–డిసెంబర్ 30 (8AM-8AM)] : 20549
- నమోదైన మరణాలు : 286
- రికవరీ అయిన వారి సంఖ్య : 98,34,141
- యాక్టీవ్ కేసులు : 2,62,272
- మొత్తం మరణాల సంఖ్య : 1,48,439
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ