దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. సెప్టెంబర్ 4, శుక్రవారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 39,36,748 కు, మరణాల సంఖ్య 68,472 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ఇప్పటికి 4,66,79,145 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రోజువారి పరీక్ష సామర్ధ్యం కూడా 11 లక్షలకు చేరుకుంది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 8,43,844
- ఆంధ్రప్రదేశ్ – 4,76,506
- తమిళనాడు – 4,51,827
- కర్ణాటక – 3,79,486
- ఉత్తరప్రదేశ్ – 2,53,175
- ఢిల్లీ – 1,85,220
- పశ్చిమ బెంగాల్ – 1,74,659
- బీహార్ – 1,44,134
- తెలంగాణ – 1,35,884
- అస్సాం – 1,18,334
- ఒడిశా – 1,16,678
- గుజరాత్ – 1,01,695
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu