భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ 3 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 10956 కరోనా పాజిటివ్ కేసులు, 396 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి చెందడం మొదలయ్యాక అత్యధికంగా ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 12, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,97,535 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రిటన్ ను దాటేసి భారత్ 4వ స్థానంలో నిలిచింది.
అలాగే కొత్తగా నమోదైన 396 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 8,498 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 1,47,195 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,41,842 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గత పది రోజులుగా అటుఇటుగా ప్రతిరోజూ పదివేల కేసులు నమోదవుతుండడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశంలో చికిత్సతీసుకుంటున్న కరోనా బాధితుల సంఖ్య కంటే వైరస్ లక్షణాలు నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగిస్తుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 12 June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 297,535
▶️ Active cases: 141,842
▶️ Cured/Discharged/Migrated: 147,195
▶️ Deaths: 8,498#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/7rlrNRU4kc
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 12, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu