దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే ముందుజాగ్రత్త దృష్ట్యా హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోస్ కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా ఏప్రిల్ 10, 2022 నుంచి ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. అయితే 18 ఏళ్లు పైబడినవారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.
18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి, రెండవ డోస్ తీసుకుని 9 నెలల పూర్తయిన వారందరూ అర్హులని, వారికీ ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఏప్రిల్ 10 నుంచి ప్రికాషన్ డోస్ అందించనున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ మొదటి డోస్, రెండవ డోస్, హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోస్ అందిస్తూ కొనసాగుతున్న ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, మరింత వేగవంతం చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ