ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది, ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కి కొందరు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం ఆరోపించారు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బిజెపి మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య మరియు ఆ పార్టీ నాయకులు, బిల్డర్లతో పాటు మరికొందరు వ్యాపారవేత్తల బృందం ఈ కుట్రలో భాగమని ఆరోపించారు. ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం గురించి ఎంహెచ్ఏకి ఈ బృందం ద్వారా ప్రెజెంటేషన్ అందించబడింది. ఇందుకోసం సమావేశాలు నిర్వహించి నిధులు సేకరిస్తున్నారు. గత రెండు నెలలుగా ఇది జరుగుతోంది, నేను చెప్పేది నిరూపించడానికి నా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి. ఈ పరిణామం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి సమాచారం అందిందని అన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠీల శాతం బాగా తగ్గిపోయిందని, అందుకే కేంద్ర ప్రభుత్వ పాలనలో నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతూ సోమయ్య నేతృత్వంలోని బృందం మరికొద్ది నెలల్లో కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సోమయ్య గతంలో సవాలు చేశారని రౌత్ గుర్తుచేశారు. మరోవైపు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను కాపాడేందుకు సేకరించిన ₹ 57 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య మరియు అతని కుమారుడు నీల్పై నిన్న చీటింగ్ కేసు నమోదు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పునరుద్ధరణకై నిధుల సేకరణ కోసం కిరీట్ సోమయ్య ప్రచారాన్ని ప్రారంభించారని, అయితే భారీగా పోగైన విరాళాలను సోమయ్య మరియు ఆయన కుమారుడు దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ