దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండగా, రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 4,51,312 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 13,086 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,35,31,650 కు చేరుకుంది. అలాగే కొత్తగా 19 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,242 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 12,456 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,28,91,933 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.53 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,14,475 (0.26%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జూలై 4 (8am)–జూలై 5 (8am)):
- కేరళ – 3322
- తమిళనాడు – 2654
- మహారాష్ట్ర – 1515
- పశ్చిమబెంగాల్ – 1132
- కర్ణాటక – 749
- తెలంగాణ – 443
- ఢిల్లీ – 420
- గుజరాత్ – 419
- హర్యానా – 371
- ఉత్తర్ ప్రదేశ్ – 297
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY