దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మూడో వేవ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. కరోనా కేసుల పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ అందించడంతో పాటుగా, ముందుజాగ్రత్త దృష్ట్యా జనవరి 10 నుంచి హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ ప్రికాషన్ డోస్ వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 160 కోట్లు దాటింది.
జనవరి 21, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 160 కోట్లు (1,60,43,70,484) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 70లక్షలమందికి పైగా(70,49,779) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు 3,96,06,464 మంది 15-18 సంవత్సరాల మధ్య వయస్సు వారికీ మొదటి డోసు, 68,61,926 మందికి ప్రికాషన్ డోస్ అందించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF